న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ నవనీత్ కౌర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కోర్టు మంగళవారం స్టే విధించింది.బాంబే హైకోర్టు.. నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.