అమరావతి : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ శివారులో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
విజయవాడ నుంచి 30 మంది ప్రయాణికులతో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు గుడివాడకు బయల్దేరింది.
ఉంగుటూరు మండలం మానికొండ శివారుకు రాగానే బస్సు అదుపుతప్పి రోడ్డు దిగువకు పల్టీ కొట్టింది. దీంతో పలువురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.
అదృష్టవశాత్తు ప్రాణం నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.
క్షతగాత్రులకు స్థానికంగా ప్రథమ చికిత్స అందించి మరో బస్సులో గమ్యస్థానానికి చేర్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి