అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కొబ్బరి లోడు లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన సుమారు వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.
లారీలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో పాలకొల్లు మండలం వెలివెల రోడ్డులో తనిఖీలు చేపట్టారు. కొబ్బరి లోడుతో వస్తున్న ఓ లారీని తనిఖీ చేసి కొబ్బరి కాయల నడుమ మూటల్లో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్తోపాటు పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.