హైదరాబాద్ : ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, తూర్పు, సెంట్రల్, పశ్చిమ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం జీహెచ్ఎంసీతోపాటు వికారాబాద్, నాగర్కర్నూల్, సంగారెడ్డి, రంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లోని 20కిపైగా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన కురిసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లా దోమ గ్రామంలో 22.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొన్నిచోట్ల చిరుజల్లులు పడినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం 36.6 నుంచి 42.6 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.