అమరావతి : చిత్తూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొని ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుపతి-అనంతపురం జాతీయ రహదారిపై భాకరాపేట కనుమ దారి వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూర్ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.