ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
టీఆర్ఎస్లో పలువురు చేరిక
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ మండలంలోని చాంద(టి) గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేర గా, వారికి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఉప ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థి ఆరె నరేశ్ కుమార్ విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఆత్మ చైర్మన్ జిట్టా రమేశ్, చాంద (టి) సర్పంచ్ భాస్కర్, మాజీ సర్పంచ్ అడెల్లు, నారాయణ, శుక్లాల్, నారాయణ పాల్గొన్నారు. మావల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మావల సర్పంచ్ దొగ్గలి ప్రమీల, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ టీఆర్ఎస్లో చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. వీరితోపాటు సుమారు 100మంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. జడ్పీటీసీ నల్లా వనిత, ఎంపీపీ చందాల ఈశ్వరి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గోవర్ధన్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గంగుల కిరణ్, వాఘాపూర్ సర్పంచ్ మయూరి, నాయకులు రాజేశ్వర్, చందాల రాజన్న, ఏవన్, గోవర్ధన్, విజ్జగిరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.