న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఇన్ఫ్లూయెంజా చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఎంకే-4482 (మోల్న్యూపిరావిర్) ట్యాబ్లెట్ కొవిడ్ వ్యాధి తీవ్రతను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయం తెలిసిందని, ఎంకే-4482 పనితీరుపై మనుషులపై జరుగుతున్న ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయని చెప్పారు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్), యూకేకు చెందిన ైప్లెమౌత్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్ తప్ప కరోనా వైరస్ తీవ్రతను తగ్గిస్తాయని చెప్పడానికి స్పష్టమైన ఔషధాలు లేవని, కరోనాపై పోరులో ఈ ట్యాబ్లెట్లు కీలకంగా మారొచ్చన్నారు. కొవిడ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడాన్ని ఈ ఔషధం తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఈ వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్లో ప్రచురించారు.