పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలో తొమ్మిదేండ్ల బాలికపై వరుసకు బావ అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.
కాగా బాలిక తన తల్లిదండ్రులకు విషయం తెలుపడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు సమాచారం తెలియడంతో నిందితుడు సత్యప్రసాద్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడి సంబంధికులు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.