అమరావతి : ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న మూడుగంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎవరూ పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విపత్తుల శాఖ ఇప్పటికే ఆయా జిల్లాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.