అమరావతి : వాయవ్య -పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంట అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
కురిస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంట గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కే కన్నబాబు తెలిపారు.