హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని వెల్లడించారు. పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడతాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయని ఆయన చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రతోపాటు యానాంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వివరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.