హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింధును, ఆమె కుటుంబసభ్యులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భ్రమరాంబ అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడుతూ..అమ్మవారి దర్శనానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉన్నాయని ఆమె తెలిపారు. 2024లో కూడా ఒలింపిక్స్ పాల్గొని స్వర్ణ పతకం సాధించడమే తన ధ్యేయమన్నారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్