అమరావతి : వరద ఉధృతికి విరిగి కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ క్రస్టుగేటు ఇవాళ లభ్యమైంది. ప్రాజెక్టు స్పిల్ వేకు 800 మీటర్ల దూరంలో విరిగిపడిన క్రస్టు గేటును అధికారులు గుర్తించారు. క్రస్టు గేటును నది నుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 5న ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అధికంగా ఉండటంతో గేటును కొంతమేర పైకి ఎత్తే క్రమంలో గాటర్స్లో సాంకేతిక సమస్య వల్ల 16 నంబర్ గేటు విరిగి ఊడిపోయింది. దీంతో ప్రాజెక్టులోని నీటిని అధికారులు దిగువకు విడుదల చేయడంతో నీళ్లు లేక ప్రాజెక్టు వెలవెలబోతున్నది.
పులిచింతల ప్రాజెక్టు వద్ద స్టాప్గేట్ల ఏర్పాటు కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఇంజినీరింగ్ నిపుణులు నాలుగు గేట్లను ఏర్పాటు చేశారు. గేట్ల ఏర్పాటు పనులను ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి పర్యవేక్షించారు.