అమరావతి : తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైసీపీ నేతలు దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించడం దారుణమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
దౌర్జన్యంగా ఓట్లు వేయించుకుంటే ఇక ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. డీసీపీ నాయకత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు.
దొంగ ఓట్ల వ్యవహారంలో గవర్నర్, రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని కోరారు. దొంగ ఓట్లు పోలైన తిరుపతి నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి