తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 26వ తేదీ బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. ఆ రోజు రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారని పేర్కొంది. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.