సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ భంగపాటుకు గురైంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిచిన మాదిరిగానే సిద్దిపేట మున్సిపాలిటీలో తమ గెలుపు ఉంటదని విశ్వసించి, ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులకు.. సిద్దిపేట ఓటర్లు షాకిచ్చారు. బండి సంజయ్తో పాటు ఇతర నాయకులకు బుద్ధి చెప్పారు. ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు పనికిమాలిన ఆరోపణలు చేసిన బీజేపీని భూస్థాపితం చేశారు.
సిద్దిపేట మున్సిపాలిటీ 22వ వార్డు నుంచి పోటీ చేసిన ఆ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు. ఇదే వార్డు నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల అరవింద్ రెడ్డి అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని తనకు తానే ఊహించుకున్న శ్రీకాంత్ రెడ్డి.. ఫలితం వెలువడిన అనంతరం ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
సిద్దిపేట మున్సిపాలిటీలో ఒకే వార్డుకు బీజేపీ పరిమితం కాగా, అచ్చంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ – 6, బీజేపీ -1 వార్డులో మాత్రమే గెలిచింది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ – 2, బీజేపీ -2 వార్డుల్లో గెలిచింది. కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ ఖాతానే తెరవలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం నకిరేకల్ లో 2 వార్డుల్లో, కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఐదు వార్డుల్లో గెలుపొందింది.
ఇవి కూడా చదవండి..