అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద ఓ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. శనివారం ఉదయం చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సును చెక్ చేశారు. అందులో రూ.3 కోట్లకుపైగా నగదు, కిలో బంగారం లభించింది. వాటికి సంబంధించి సరైన లెక్కా పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీకి చెందినదిగా, బంగారం హైదరబాద్లోని ఓ ప్రముఖ జ్యూయలరీ షాప్కు సంబంధించిందిగా గుర్తించారు. పట్టుబడ్డ బంగారాన్ని కర్నూలుకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహరంలో చేతన్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..