శ్రీకాకుళం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని హోల్సేల్గా కార్పొరేట్ సంస్థలకు బేరం పెట్టారని సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ) జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రైవేటీకరణకు ప్రధాన కారకుడైన మోదీ రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 19 రాజకీయ పార్టీలతో కలిసి ఈ నెల 27న భారత్ బంద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను దివాళా తీసేందుకే.. ప్రైవేటు కంపెనీలకు భారీ మొత్తంలో రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.