తిరుపతి,జూన్ 13: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ జెఈఓ సదా భార్గవి, ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ కస్తూరి బాయి, విఎస్వో మనోహర్, ఏఇఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు.