అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హై కోర్టు అనుమతి ఇచ్చింది. లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని పేర్కొన్నది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఎన్నికలను సమర్థించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 1న ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ఆధారంగా గత ఏప్రిల్ 8న రాష్ర్ట వ్యాప్తంగా నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ను హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన విషయం విదితమే. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని పేర్కొన్నారు. అయితే హైకోర్టు ధర్మాసనం తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
సుప్రీం కోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్ విధించాలని స్పష్టం చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీల్ చేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఓట్ల లెక్కింపునకు సమర్థిస్తూ ఈ రోజు తీర్పును వెలువరించింది.