అమరావతి: పరిషత్ ఎన్నికల్లో సంక్షేమానికే ప్రజలు పట్టం కట్టారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు. ఈ ఫలితాలు టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెంప చెల్లుమనిపించాయని పేర్కొన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో 85 శాతానికి పైగా స్థానాలు గెలిచామన్నారు. ఆదర్శపాలనకు ప్రజలు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.