అమరావతి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ రోజు రాత్రి అంకురార్పణ, ఆదివాసములు.. రేపు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యహవచనం, అగ్నిప్రతిష్ఠాపన, అలంకార తిరుమంజనం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, ఆలయ సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.