అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపటి పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 513 జడ్పీటీసీ, 7, 230 ఎంపీటీసీ స్థానాలకు రేపు ఎన్నికలు జరుగనున్నాయి.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జడ్పీటీసీ స్థానాలకు 2,092 మంది.. ఎంపీటీసీ స్థానాలకు 19, 002 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 33,663 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. 2 కోట్ల 82 లక్షల 15 వేల 104 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికల విధుల్లో 2 లక్షల 1,978 మంది సిబ్బంది పాల్గొనున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అధికార వైసీపీతోపాటు జనసేన, బీజేపీ, వామపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి.
ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
పలువురు ఆ పార్టీ నేతలు ఆయన నిర్ణయంతో విబేధించి అభ్యర్థులను పోటీలో నిలుపుతామని ప్రకటించారు. దీంతో ఆది నుంచి వివాదాస్పదంగా మారిన పరిషత్ ఎన్నికలు ఆసక్తిగా మారాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి