కూతుళ్ల హత్య కేసు.. తల్లీదండ్రులు అరెస్ట్

చిత్తూరు : జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో తల్లీదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ-1గా తండ్రి పురుషోత్తంను, ఏ-2గా తల్లి పద్మజను పోలీసులు చేర్చారు. చిన్న కూతురు దివ్యను తల్లి కొట్టిచంపగా, పెద్ద కూతురు అలేఖ్యను పూజగదిలో తండ్రి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అసలేం జరిగింది?
శివభక్తులైన పుతుషోత్తమనాయుడు, పద్మజ దంపతులు ఆదివారం రాత్రి పూజలు చేస్తూ తమ కు మార్తెలను చంపేశారు. మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్తో కొట్టి హతమార్చారు. అనంతరం దంపతులిద్దరూ పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారికి విష యం తెలిసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ.. నిందితులు పురుషోత్తమనాయుడు, పద్మజ ప్రవర్తన విచిత్రంగా ఉన్నదని చెప్పారు. ‘తమ కూతుళ్లు అలేఖ్య, సాయిదివ్య చనిపోలేదని, వారు తిరిగి బతుకుతారని నిందితులు పేర్కొంటున్నారు. ఇప్పటితో కలియుగం ముగిసిపోయిందని, సత్యయుగం ప్రారంభమైందని చెప్తున్నారు. రక్తాభిషేకం చేస్తే కలి పురుషుడు శాంతిస్తాడని, అందుకే తమ కూతుళ్లను బలి ఇచ్చామని అంటున్నారు’ అని డీఎ స్పీ చెప్పారు. అలాగే కరోనా కూడా చైనాలో పుట్టలేదని, శివుడి వెంట్రుకల్లో పుట్టిందని వారు చెప్తున్నట్లు తెలిపారు. హత్యకు గురైనవారు, హంతకులు పూర్తి గా దైవభక్తిలో లీనమైపోయారని ప్రాథమికంగా తేలిందని డీఎస్పీ చెప్పారు. యువతుల తల్లి పద్మజ బిడ్డలను కొట్టి చంపిందని, ఆ సమయంలో తండ్రి పురుషోత్తమనాయుడు అక్కడే ఉన్నాడని తెలిపారు. తల్లిదండ్రులు మానసికంగా సతమతమవుతున్నట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- ఇండియా విజ్ఞప్తికి డోంట్ కేర్..సౌదీ ప్రతి సవాల్!
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు