న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రారంభం నుంచీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే రానున్న రోజుల్లో వీటి రేట్లు మరింత తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. పైగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ మధ్యే గ్యాస్ ధర కూడా రూ.10 మేర తగ్గింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి చాలా మెరుగుపడిందని, దీంతో రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత తగ్గుతాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఇప్పుడిప్పుడే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గడం మొదలైంది. ఇవి మరింత తగ్గుతాయి. ముడి చమురు ధరలు తగ్గితే ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేస్తామని గతంలోనే చెప్పామని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం వీటిపై ఉన్న పన్నులను మాత్రం తగ్గించే ప్రసక్తే లేదని కూడా ప్రధాన్ స్పష్టం చేశారు. కేంద్రానికి కూడా కొన్ని ఆదాయ వనరులు ఉండాలి కదా అని ఆయన అన్నారు.
ఇవికూడా చదవండి..
మార్స్పై దిగిన నాసా మినీ హెలికాప్టర్
సారీ.. ఆ లోగో ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకోలేను: మొయిన్ అలీ
వన్డేల్లో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కొత్త వరల్డ్ రికార్డ్
మీరు క్రికెట్ ఎక్స్పర్టా? ఇది అవుటా.. కాదా చెప్పండి.. వీడియో
సినిమా టైటిల్ చెప్పని డైరెక్టర్.. ఎత్తి కుదేసిన నటుడు.. వీడియో
మమతా బెనర్జీ తప్పుడు ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాషింగ్టన్ సుందర్ కుక్క పేరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా