శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి ఆదివారం సాయంత్రం పల్లకి సేవను ఘనంగా జరిపించారు. స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించిన ఊయలలో ఆశీనులను చేసి పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి ఆలయ ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ బేగంపేటకు చెందిన సుపర్ణ ఇంఫోటెక్ లిమిటెడ్ నిర్వాహకులు దేవస్థాన నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం ఇచ్చారు. ఆలయ పర్యవేక్షకురాలు సాయికుమారికి చెక్కు రూపంలో విరాళాన్ని అందించారు. ఆలయ అధికారులు దాతలకు స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించి, స్వామివారి చిత్రపటంతోపాటు శేషవస్త్రాలు, పరిమళ విభూది, లడ్డూ ప్రసాదం
అందించారు.