అమరావతి : యాస్ తుపాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. తుపాన్ ప్రభావితం చేస్తున్నదని అంచనా వేస్తున్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా ముందస్తు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆ రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో అక్కడక్కడా జల్లులు మినహా తుపాన్ ప్రభావం పెద్దగా లేదని సీఎంకు తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆక్సిజన్ కొరత రాకుండా జనరేటర్లు, డీజిల్ అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.