అమరావతి : కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆదివారం మాంసం, మత్స్య అమ్మకాలను నిషేధించింది. నగరంలోని మాంసం, చేపలు, రొయ్యల దుకాణాల్లో పౌరులు కొవిడ్ నిబంధనలు పాటించకుండా విక్రయాలు కొనసాగిస్తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు గడిచిన ఆదివారం మాంసం దుకాణాలను బంద్ చేశారు. ఇది విజయవంతం కావడంతో మే 30న సైతం మాంసం, మత్స్య దుకాణాలను బంద్ చేయ నిశ్చయించారు.