అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,620 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5,757 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 18,85,716కు పెరిగాయి. వీరిలో 18,32,971 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇంకా 40,074 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 12671కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 91,231 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.