అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొన్నిరోజులుగా నిత్యం 2 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ 2,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,201 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,94,4222కు పెరిగాయి. ఇప్పటివరకు1,90,7201 కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 23,843 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,178కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 88,149 శాంపిళ్లను పరీరక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.