అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి క్రమంగా కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,442 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,412 మంది కోలుకున్నారు. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 19,73,996కు పెరిగాయి. ఇవాళ్టివరకు 19,40,368 మంది కోలుకున్నారు. ఇంకా 20,184 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,444కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 85,822 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.