అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,345 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 3 వేల మంది కోలుకున్నారు. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 1,93,4450కి పెరిగాయి. ఇవాళ్టి వరకు 1,89,6499 మంది కోలుకున్నారు. ఇంకా 24,854 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,097కు చేరాయి. ఇవాళ 81,740 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.