అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 84,858 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 2,252 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,95,4765కు పెరిగింది. వైరస్ బారినపడిన వారిలో 2,440 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇవాళ్టివరకు మొత్తం 1,91,9354 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 22,155 పాజిటివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా రాష్ట్రంలో మొత్తం మరణాలు 13,256 చేరాయి.