అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు.. మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,956 మంది బాధితులు చికిత్సకు కోలుకున్నారు. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,59,942కు పెరిగింది. ఇవాళ్టివరకు 19,25,631 మంది కోలుకున్నారు. మరో 20,999 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,312కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 70,695 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.