అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 1,747 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,365 మంది కోలుకున్నారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 1,95,0339 పెరిగాయి. ఇవాళ్టి వరకు 1,91,4177 మంది కోలుకున్నారు. మరో 22,939 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,223కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 65,920 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.