అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గత పదిరోజులుగా 2 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. ఇవాళ ఆ సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 1,627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2017 మంది చికిత్సకు కోలుకున్నారు. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,56,392కు పెరిగింది. ఇవాళ్టి వరకు 19,21,371 మంది కోలుకున్నారు. మరో 21748 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13273కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 57,672 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.