అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,968 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,70,008కి పెరిగింది. ఇవాళ్టి వరకు మొత్తం 19,36,016 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 20,582 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,410కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 59,641 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.