ఏపీలో అగ్రవర్ణ పేద మహిళల సంక్షేమానికి సరికొత్త పథకం

అమరావతి : ఈబీసీ (అగ్రవర్ణ పేద) మహిళల సంక్షేమానికి ఈబీసీ నేస్తం పేరుతో సరికొత్త పథకం అమలు చేయనున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఏటా రూ. 15 వేల చొప్పున రానున్న మూడేండ్లలో రూ. 45 వేలు ఆర్థిక సాయంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. 45-60 ఏండ్లలోపు ఈబీసీ మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార- ప్రజాసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
రూ. 670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. మంగళవారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు బోధనా ఫీజు మొత్తాన్ని చెల్లించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. క్యాలెండర్ ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించనున్నామని అన్నారు. రూ.లక్షా 43 వేల మంది లబ్ధిదారులకు రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ. 3500 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగిస్తే రూ. 1000 జరిమానా
- అమెరికా వైమానిక దాడిలో 17 మంది మిలిటెంట్లు మృతి
- దేశంలో కొత్తగా 16,577 కొవిడ్ కేసులు
- బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాశ్.. !
- 100 జిలటిన్ స్టిక్స్.. 350 డిటోనేటర్లు స్వాధీనం
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!