పహాడీషరీఫ్, జూలై 6 : పరిసరాల పరిశుభ్రతతోనే మెరుగైన జీవన విధానం సాధ్యమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 11,12,13,15వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు వార్డుల్లో రూ. 55లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్గాంధీనగర్లోని మురుగు నీరు పారె స్ట్ ప్రాంతంలోకి వెళ్లకుండా చూడాలన్నారు. 60గజాల లోపు స్థలం ఉన్న ప్రతి ఇంటికి రూపాయికే నల్లా కనెక్షన్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.
స్థానిక కౌన్సిలర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పహాడీషరీఫ్ నుంచి మా మిడిపల్లికి వెళ్లే రహదారిని డబుల్ రోడ్డు అభివృద్ధి చేయడానికి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసికెళ్లినట్లు ఆమె తెలిపా రు. కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ పర్హ నా నాజ్, కమిషనర్ కుమార్, జల్పల్లి కో-ఆప్షన్ మెం బర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు ఖాలెద్ బిన్ అబ్దు ల్లా, పుష్పమ్మ, సయ్యద్ హుమేరా రహమన్, శంషొద్దీన్, కంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, టీఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.
డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై మంత్రి మున్సిపాలిటీ పరిధిలో మెగా నర్సరీ ఏర్పాటు చేసుకుందామ న్నారు. మరోక చోట నుంచి మొక్కలను కొనుగోలు చేసే బదులు మహిళా సంఘాలు మొక్కలను పెంచాలన్నారు. ఆదాయం కూడా వస్తుందన్నారు. వార్డు ఒకటి చొప్పున మహిళా సంఘాలకు భవనాల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ స్థలాల విషయంలో ఫోన్లో తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డితో మాట్లాడారు.