అమరావతి : ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,716 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 3,359 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,86,703కు చేరింది. 918985 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 60,208కి పెరిగాయి. 7,510 ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 39,610 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి