అమరావతి : ఈ నెల 24న జాతీయ ఎస్పీ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్కు రానుంది. గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దళిత బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిజనిర్ధారణకు ఎస్సీ కమిషన్ బృందం వస్తున్నట్లు తెలిసింది. జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దర్, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థితో కూడిన బృందం గుంటూరుకు వచ్చి ఈ కేసులో పలువురు విచారించనున్నట్లు సమాచారం. మృతురాలు రమ్య కుటుంబ సభ్యులను సైతం వీరు కలవనున్నట్లు తెలుస్తున్నది. అనంతరం ఎస్సీ కమిషన్ బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్తోపాటు డీజీపీ గౌతమ్ సవాంగ్తో భేటీ కానుంది.