అమరావతి : అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ గడువు కోరడంతో ఈ నెల 26 వరకు దాఖలు చేసేందుకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. విచారణను ఈ నెల 26 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్కు బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోర్టు పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు. పిటిషన్పై ఈ నెల 7న సైతం కోర్టు విచారణ నిర్వహించగా కౌంటర్ దాఖలుకు సీబీఐ అధికారులు, జగన్ కోర్టును సమయం కోరారు. దీంతో విచారణను ఈ నెల 17కు కోర్టు వాయిదా వేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.