అమరావతి : ఏపీలో రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని అధికారులకు సూచించింది. విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. లెక్కింపు ప్రక్రియను వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీకెమెరాల ద్వారా చిత్రీకరించాలని ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియ ఫుటేజీలను ఎన్నికల రికార్డుగా భద్రపరచాలని పేర్కొంది. రాత్రి 8 గంటలలోగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగించేలా చూడాలని, 10 కంటే తక్కువ మెజారిటీ ఉన్నప్పుడే రీకౌంటింగ్కు అనుమతి ఇవ్వాలంది.