అమరావతి : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలో 12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల్లో 2,215 డివిజన్లు, వార్డులకు వివిధ పార్టీల నుంచి 7,552 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గత నాలుగురోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 10న పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పలు మున్సిపాలిటీల్లో అధికార వైసీపీ, టీడీపీల నడుమ ఘోరాఘోరీ పోటీ నెలకొనే అవకాశముంది.