హైదరాబాద్ : నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరుసగా లేఖాస్త్రాలు సందిస్తున్నారు. నిన్నటి వరకు ఎన్నికల హామీలు, వివిధ సమస్యలపై సీఎంకు లేఖలు రాసిన ఆయన ఈ సారి పార్టీ ఎంపీ విజయస్థాయి రెడ్డిని అదుపులో పెట్టాలంటూ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి అనవసరంగా నోరు పారేసుకొంటున్నారని ఆయనను వెంటనే అదుపు చేయాలని లేఖలో కోరారు. విజయసాయిరెడ్డి తీరుతో పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘అశోక్గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు. మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు సైతం ఇచ్చింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి అశోక్గజపతిరాజుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వెంటనే అదుపులో పెట్టాలి’ అని సీఎం జగన్కు లేఖ ద్వారా రఘురామ విజ్ఞప్తి చేశారు.