అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. బుధవారం ఆయన సీఎంకు ఏడో లేఖ రాశారు. రైతు భరోసా అంశంపై లేఖలో ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో రైతులు పెద్ద ఎత్తున వైసీపీకి అండగా నిలిచారని, వారికి ఇచ్చిన హామీలను తూ.చా తప్పకుండా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం రూ. 12,500ల నుంచి 13500కు పెంచింది. పెంచిన మొత్తంతోపాటు కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు కలిసి మొత్తం 19,500 ఒకేసారి చెల్లించాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఎం జగన్ను ఆయన కోరారు. ఉద్యోగులకు బకాయిలు పడ్డ ఏడు డీఏలు వెంటనే అమలు చేయాలని రఘురామ నిన్న ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.