గుంటూరు : ఎంపీ రఘురామను వైద్య పరీక్ష నిమిత్తం తక్షణం రమేశ్ హాస్పటల్కు పంపాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. రఘురామ కేసులో సాయంత్రం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రమేశ్ హాస్పటల్లోనూ పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాన్ని అధికారులు పట్టించుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
కస్టడీలో ఉండగానే సీఐడీ అధికారి పిటిషనర్ను కలిశారు. కస్టడీలో ఉండగా పిటిషనర్ను కలవటం చట్ట విరుద్ధమని కోర్టుకు న్యాయవాది విన్నవించారు. కాగా రఘురామకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఎంపీ రఘురామను జిల్లా జైలు నుంచి తక్షణం రమేశ్ దవాఖానకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.