అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఆనంద్ నగర్లో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేసింది. ఆనంద్ నగర్లో బ్యుటీషియన్గా పనిచేస్తున్న లక్ష్మీ అనూషకు కూతురు చిన్మయి, కుమారుడు మోహిత్ ఉన్నారు. 13 ఏండ్ల క్రితం భర్త చనిపోవడంతో తాడేపల్లి నుంచి రాజమండ్రి వచ్చి జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నది.
అయితే తరచూ పిల్లలను కొడుతుండటంతో అనూష తల్లి కనకదుర్గ.. ఆమెను మందలించింది. దీంతో కనకదుర్గను అనూష గాయపర్చింది. కాగా, ఆదివారం రాత్రి తన పిల్లకు ఉరివేసి చంపేసింది. అనంతరం ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కాగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నది. చిన్నారుల మృతదేహాను స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితురాలు అనూషను అరెస్టు చేశారు. ఆమెపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడాని ఈ హత్యలకు పాల్పడిందా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.