సామర్థ్యమున్ దవాఖానల్లోనే కొవిడ్ చికిత్స
రోగుల వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలి
ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్
ప్రైవేట్ వైద్యులతో సమావేశం
ఎదులాపురం, ఏప్రిల్15: జిల్లాలోని ప్రైవేట్ దవాఖాన ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని డీఎంహె వో నరేందర్ రాథోడ్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఎంవో కార్యాలయంలో గురువారం ప్రైవేట్ దవాఖానల వైద్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రో జురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్ర భుత్వ ఆదేశాల మేరకు సామర్థ్యం ఉన్న ప్రైవేట్ దవాఖా నల్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందించాలని సూచించారు.ప్రభుత్వం కేటాయించిన రేట్ల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భం గా పలు సూచనలు చేశారు. అనంతరం నోడల్ అధికారి అశోక్ పలు విషయలపై అవగాహన కల్పించి, ప్రభుత్వ ఆదేశాలను వివరించారు. ప్రైవేట్ దవాఖానల వైద్యు లు ప్రకాశ్, రాము, శివ, కళ్యాణ్చక్రవర్తి, సంజయ్ గుజరాతి, అమీత్ సుందర్, మహాబలేశ్వర్, సందీప్, రమేశ్ పవార్, రాకేశ్ రెడ్డి, సంధ్యారాణి, విజయలక్ష్మి, సచిన్ కుమార్, సాహిత్య తదితరులు పాల్గొన్నారు.
ఫ్రంట్లైన్ వర్కర్స్కు వ్యాక్సిన్ ఇవ్వాలి
ఫ్రంట్లైన్ వర్కర్స్కు తొలుత వ్యాక్సిన్ ఇవ్వాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. టీకా మహోత్సవ్ కార్యక్రమాన్ని వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కొవి డ్ నిబంధనలు పాటించాలని సూచించారు. డొల్లర, ల క్ష్మీపూర్, బేల, ఘన్పూర్ వద్ద సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.