కోల్కతా : బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ట్విట్టర్ను నియంత్రిచలేకపోతోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కట్టడి చేయలేకే ట్విట్టర్ను అణిచివేయాలని చూస్తున్నట్లు తెలిపారు. దీన్ని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. గురువారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. నూతన మార్గదర్శకాల ప్రకారం సమస్యల పరిష్కారానికి ముఖ్య సిబ్బందిని నియమించడంలో వైఫల్యం కారణంగా సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫాం భారతదేశంలో తన సేఫ్ హార్బర్ కవచాన్ని కోల్పోయిందన్నారు.
ట్విట్టర్ అంశం మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం తనని కూడా ఎదుర్కోలేకపోతోందన్నారు. తనని ఎదుర్కోలేకే తమ ప్రభుత్వాన్ని అణచివేసే యత్నం చేస్తోందన్నారు. కేంద్రం ఇకనైనా నియంతృత్వ ధోరణి ఆపాలన్నారు. బెంగాల్లో ఎక్కడా రాజకీయ హింస లేదన్నారు. రాజకీయ హింసను తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ హింస అనేది కేవలం బీజేపీ జిమ్మిక్కేనన్నారు. నదిలో మృతదేహాలు తేలుతున్న యూపీపై కేంద్రం దృష్టిపెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. యస్ తుపాను తర్వాత ఇప్పటికీ కేంద్ర ఆర్థికసాయం లేదన్నారు.