ఎన్టీఆర్కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా?: కొడాలి నాని

అమరావతి: టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు కుట్రలు చేశారని విమర్శించారు. ఎన్టీఆర్ పార్టీని, సీఎం హోదాను చంద్రబాబు తస్కరించారని మండిపడ్డారు. పదవులు, ఓట్ల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతాడని అన్నారు.
'ఎన్టీఆర్ను ఇష్టపడేవారు చంద్రబాబును రాష్ట్ర సరిహద్దులు దాటించాలి. ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి నాడే భారతరత్న ఇవ్వాలని బాబు కోరుతాడు. ఎన్టీఆర్కు భారతరత్న తెచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. నీచమైన పనుల్లో బాబుకు ప్రపంచరత్న ఇవ్వాలి. ఎన్టీఆర్కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా? టీడీపీని సర్వనాశనం చేయగల శక్తి చంద్రబాబు, లోకేశ్కే ఉంది. ఓటుకు కోట్లు కేసులో హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి వచ్చాడు. అఖిల ప్రియ అరెస్ట్పై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడు. దేవాలయాలపై దాడుల ఘటనలో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని' మంత్రి నాని హెచ్చరించారు.
తాజావార్తలు
- రోదసీలో అడుగిడిన యూరి గగారిన్ జయంతి.. చరిత్రలో ఈరోజు
- తన కుక్కల్ని వైట్హౌజ్ నుంచి పంపించేసిన బైడెన్
- రాహుల్కే పార్టీ పగ్గాలు : యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం!
- కొండగట్టు అంజన్న భక్తుల కొంగు బంగారం : ఎమ్మెల్సీ కవిత
- గుడ్న్యూస్.. కొవాగ్జిన్ సేఫ్ అని తేల్చిన లాన్సెట్
- ఉభయసభలకు పెట్రో సెగ.. 2 వరకు వాయిదా
- వాళ్లను జైలుకు పంపకుండా విడిచిపెట్టను: బీజేపీ ఎమ్మెల్యే
- రణ్బీర్ కపూర్కు కరోనా పాజిటివ్
- రూ.12 వేలు తగ్గిన బంగారం: పెట్టుబడికి ఈ టైం సరైందేనా?!
- ఎనిమిది విడుతల పోలింగ్పై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..!