అమరావతి : కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో జరిగిన పేలుడు ఘటనలో గని యజమానిపై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి లేకుండా గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు గనులశాఖ విచారణలో గుర్తించి బాధ్యుడిపై కేసు నమోదుకు ఆదేశించింది.
పర్యావరణ అనుమతులు లేకపోవడంతో గతేడాది సెప్టెంబర్లోనే ఇక్కడ పనులు నిలిపివేసినట్లు గనులశాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి వెల్లడించారు. గనిలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని గనులశాఖ డైరెక్టర్ మధ్యాహ్నం పోలీసులతో కలిసి పరిశీలించారు.
పేలుళ్లు జరిపేందుకు ఇవాళ వేంపల్లి నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మామిళ్లపల్లెలో సుమారు30 హెక్టార్లలో ముగ్గురాయి గని విస్తరించి ఉంది.
గనిలో పేలుళ్లు జరిపేందుకు తీసుకువచ్చిన జిలెటిన్స్టిక్స్ను ఈ ఉదయం వాహనం నుంచి కూలీలు
అన్లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించి 10 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.